Hyderabad Metro Rail project, has announced on Wednesday a 10% discount on all trips made through smart cards up to March 31, 2018. <br /> <br />హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్కార్డ్తో ప్రయాణం చేసేవారికి ఛార్జీలో పది శాతం రాయితీని ఎల్ అండ్ టీ ప్రకటించింది.2018 మార్చి వరకు ఈ రాయితీని అందించనున్నట్టు ఎల్ అండ్ టీ కంపెనీ తెలిపింది. <br />మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్టు ప్రకటించింది. <br />హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్కార్డుతో ప్రయాణం చేసేవారికి ఛార్జీల్లో 10 శాతం రాయితీని కల్పించనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. డిసెంబర్ 7వ, తేది నుండి ఈ రాయితీ వర్తింపజేయనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ 2018 మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని ఎల్ అండ్ టీ ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్కార్డ్ ద్వారా ప్రయాణం చేసిన వారికి కేవలం 5 శాతం మాత్రమే రాయితీని ఇచ్చేవారు. కానీ, డిసెంబర్ 7వ, తేది నుండి పది శాతం రాయితీని అందిస్తున్నారు. <br />రూ.200 చెల్లించి స్మార్ట్కార్డును తీసుకోవాలి. ఇందులో రూ.100 ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏడాదిపాటు ఈ కార్డు చెల్లుబాటవుతుంది. స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద వీటిని పొందవచ్చు.